ఆరుగురు ఉగ్రవాదుల హతం | Army foils infiltration bid in Keran Sector of J-K, 6 terrorists killed | Sakshi
Sakshi News home page

ఆరుగురు ఉగ్రవాదుల హతం

Jun 11 2018 2:14 AM | Updated on Mar 23 2019 8:04 PM

Army foils infiltration bid in Keran Sector of J-K, 6 terrorists killed - Sakshi

కేరన్‌లో అప్రమత్తంగా భద్రతా సిబ్బంది

శ్రీనగర్‌: పాకిస్తాన్‌ వైపు నుంచి సరిహద్దులు దాటి దేశం లోపలికి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన యత్నాన్ని సైన్యం విజయవంతంగా తిప్పికొట్టింది. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద ఆదివారం అనుమానాస్పద కదలికలను పసిగట్టిన సైన్యం అప్రమత్తమైంది.

ఈ సందర్భంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన అనంతరం అక్కడి అటవీ ప్రాంతంలో తనిఖీలను ముమ్మరం చేసినట్లు సైన్యం తెలిపింది. రంజాన్‌ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో సైనిక కార్యకలాపాలను కేంద్రం నిలిపివేసినప్పటికీ ఉగ్రవాదుల కదలికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.  
కేరన్‌లో అప్రమత్తంగా భద్రతా సిబ్బంది

Advertisement
 
Advertisement
Advertisement