సాక్షి, హైదరాబాద్: కశ్మీర్ వేర్పాటువాద సంస్థ దుక్త్రాన్–ఏ–మిల్లత్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అసియా ఆంద్రాబీని నగరవాసి అబ్దుల్లా బాసిత్ కోణంలోనూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు విచారించనున్నారని తెలిసింది. ఆమె ఉగ్రవాద కార్యకలాపాలకు అవసరమైన నిధుల సమీకరణ కేసులో అరెస్టు అయి, ప్రస్తుతం ఎన్ఐఏ ఢిల్లీ యూనిట్ అదుపులో ఉన్నది. ఈమెకు నగరంతోనూ కొన్నిలింకులు ఉన్నాయి. 2015లో నగరంలో చిక్కిన బాసిత్ నేతృత్వంలోని ‘ఐసిస్ త్రయం’సైతం కశ్మీర్ వెళ్లి ఈమెను కలవడానికి ప్రయత్నాలు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు కనుగొన్నారు.
ఉగ్ర నిధుల కేసులో ఎన్ఐఏ అధికారులు ఈ నెల 4న అసియా ఆంద్రాబీతోపాటు ముసరత్ ఆలం, షాబీర్ షాలను అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం పది రోజులపాటు వీరిని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. అప్పట్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి) జాతీయ మాజీ అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ కుటుంబాన్ని 2014లో నగరంలో ఆమె పరామర్శించి వెళ్లినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి.
ఐసిస్లో చేరేందుకు సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న అబ్దుల్లా బాసిత్(గత ఏడాది మళ్లీ అరెస్టు అయ్యాడు) సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్లను 2015 డిసెంబర్లో సిట్ పోలీసులు నాగ్పూర్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. ‘సిమి’సలావుద్దీన్కు బంధువులైన వీరు నాగ్పూర్ నుంచి విమానంలో శ్రీనగర్ వెళ్లి అసియాను కలవాలనే ఉద్దేశంతో బయలుదేరారనే విష యం వెలుగులోకి వచ్చింది. ఈమె కుమారుడు సైతం నగరంలోని ఓ విద్యాసంస్థలో విద్యనభ్యసించాడు.
ఈ నేపథ్యంలోనే 2012లోనూ ఆంద్రాబీ ఓసారి హైదరాబాద్కు వచ్చి వెళ్లారని సమాచారం. పాక్ అనుకూలవాదిగా ముద్రపడ్డ ఆంద్రాబీ 2015 సెప్టెంబర్లో కశ్మీర్లో పాకిస్తాన్ జాతీయ జెండాలను ప్రదర్శించి వివాదాస్పదమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన శ్రీనగర్ పోలీసులు ఆమెను అరెస్టు కూడా చేశారు. 2016లో ఓ సందర్భంలో జాతీయ మీడియాతో మాట్లాడిన అసియా హైదరాబాద్ వచ్చి సలావుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించినట్లు అంగీకరించారు. తాజాగా ‘అబుదాబి మాడ్యుల్’ కేసులో గత ఏడాది బాసిత్ అరెస్టు కావడం, ఇప్పుడు ఆంద్రాబీ సైతం ఎన్ఐఏ కస్టడీలో ఉండటంతో ఆమెను బాసిత్కు సంబంధించిన వివరాలపై ప్రశ్నించే అవకాశం ఉందని తెలిసింది.
బాసిత్ కోణంలోనూ ఆంద్రాబీ విచారణ?
Published Tue, Jun 11 2019 2:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement