రూ.58 లక్షల విలువైన బంగారం స్వాధీనం | 2 KG Gold Foils Concealed, Man Were Arrested In Delhi Airport | Sakshi
Sakshi News home page

రూ.58 లక్షల విలువైన బంగారం స్వాధీనం

Mar 21 2018 8:32 PM | Updated on Oct 9 2018 5:39 PM

సాక్షి, న్యూఢిల్లీ:  విదేశాల నుంచి అక్రమంగా బంగారం తెస్తూ ఓ ప్రయాణికుడు దొరికిపోయాడు. ఇందిరా గాంధీ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తీసుకువచ్చేందుకు అతగాడు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయాడు.

వివరాల్లోకి వెళితే... దుబాయ్‌ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి సుమారు రూ.58 లక్షల విలువ చేసే 1930 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ ప్రయాణికుడు బంగారాన్ని .. పలుచని రేకులుగా తయారు చేసి వాటిని అట్ట పెట్టెలు, స్కూలు బ్యాగ్‌ల మధ్య కూర్చి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశాడు. కానీ అతడిని అడ్డగించిన విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement