మార్కెట్‌లోకి కిడ్స్‌ ఫ్యాన్స్‌...

Usha International Launch Kids Fan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ బ్రాండ్‌ ఉషా ఇంటర్నేషనల్‌ తాజాగా మార్కెట్లోకి కిడ్స్‌ ఫ్యాన్లను విడుదల చేసింది. ఈ ఫ్యాన్ల మీద బార్బీ, చోటా భీమ్, డొరేమన్‌ వంటి కార్టూన్‌ క్యారెక్టర్స్‌ బొమ్మలను ముద్రించి ఉంటాయి. రిమోట్‌ కంట్రోల్‌ ఆధారిత ఈ ఫ్యాన్ల ధర రూ.4,500 నుంచి ప్రారంభం. రెండేళ్ల వారంటీ ఉంటుంది. పిల్లల కళలు, అభిరుచుల ఆధారంగా 3 నుంచి 8 ఏళ్ల వయస్సు పిల్లల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించామని ఉషా ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ (ఎలక్ట్రిక్, ఫ్యాన్‌ అండ్‌ పంప్స్‌) రోహిత్‌ మథూర్‌ తెలిపారు. కిడ్స్‌ ఫ్యాన్ల విభాగంలో ప్రముఖ బ్రాండ్‌గా ఎదుగుతున్నామని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top