ఏప్రిల్‌ నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలపై రాయితీలు  | Subsidies on electric vehicles from April | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలపై రాయితీలు 

Mar 11 2019 1:03 AM | Updated on Mar 11 2019 1:03 AM

Subsidies on electric vehicles from April - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని వేగంగా అమల్లోకి తీసుకొచ్చేందుకు, తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్‌–2 పథకం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద 2019 ఏప్రిల్‌ 1 నుంచి 3 ఆర్థిక సంవత్సరాల కాలంలో కేంద్రం రూ.10,000 కోట్ల మేర విద్యుత్‌తో నడిచే వాహనాల కొనుగోలుదారులకు రాయితీలు కల్పించనుంది. ఈ పథకం కింద 10 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు, ఒక్కో వాహనానికి రూ.20,000 వరకు ప్రోత్సాహకం లభించనుంది. 35వేల కార్లకు ఒక్కోదానికి రూ.1.5 లక్షల సబ్సిడీ పొందొచ్చు. హైబ్రిడ్‌ కార్లకు ఒక్కో వాహనానికి రూ.13,000–20,000 వరకు రాయితీని ప్రతిపాదించారు.

అలాగే, 5 లక్షల ఈ రిక్షాలకు, ఒక్కో వాహనంపై రూ.50,000 వరకు రాయితీ లభిస్తుంది. అలాగే, 7,090 ఈ బస్సులకు ఒక్కో దానికి రూ.50 లక్షల సబ్సిడీ లభించనుంది. 2019–20 సంవత్సరం లో రూ.1,500 కోట్లు, 2020–21లో  5,000 కోట్లు, 2021–22లో 3,500 కోట్లను వాహన కొనుగోళ్ల రాయితీలకు కేటాయించారు. బస్సులకు ధర లో గరిష్టంగా 40%, ఇతర వాహనాలకు 20%గా ప్రోత్సాహకాన్ని పరిమితం చేశారు. ఇది సరైన సమయంలో సరైన అవకాశమని, ఫేమ్‌–1కు, ఫేమ్‌–2కు మధ్య విరామం లేకుండా కొనసాగింపు అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణుమాథుర్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement