స్వల్ప లాభాల్లో సూచీలు
సాక్షి,ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం పుంజుకుని సెన్సెక్స్ 84 పాయింట్లు ఎగిసి 37481వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు లాభంతో 11068 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్ళ ధోరణి కనిపిస్తోంది. ఇన్ఫోసిస్, పవర్గ్రిడ్, హీరోమోటా కార్ప్, ఐషర్ మోటార్స్, హెచ్సీఎల్ టెక్, ఎన్టీపీసీ, విప్రో, టీసీఎస్ లాభపడుతున్నాయి. యస్ బ్యాంకు, బ్రిటానియా, ఇండియాబుల్స్ హౌసింగ్, బీపీసీఎల్, అల్ట్రా టెక్ సిమెంట్, జెఎస్డబ్ల్యూ స్టీల్ నష్టపోతున్నాయి.
మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ బలహీనంగా ట్రేడ్ అవుతోంది.
మరిన్ని వార్తలు