రెండు వారాల కనిష్టానికి రూపాయి
డాలర్తో 32 పైసలు నష్టం
ముంబై: డాలర్తో రూపాయి మారకం విలువ సోమవారం 32 పైసలు నష్టపోయింది. ఫారెక్స్ మార్కెట్లో 69.88 వరకు తగ్గిన రూపాయి చివరికి 69.67 వద్ద ముగిసింది. ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. ఇరాన్ చమురు దిగుమతులపై మినహాయింపులను అమెరికా ఎత్తివేయనుందన్న వార్తలు సెంటిమెంట్పై ప్రభా వం చూపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల రూపాయిపై ప్రభావం చూపించిందని, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాల స్వీకరణ సైతం ఇందుకు కారణమైనట్టు ఆనంద్ రాఠి రీసెర్చ్ అనలిస్ట్ రుషబ్ మారు తెలిపారు.
మరిన్ని వార్తలు