రూపాయి మళ్లీ ఢమాల్‌!

Rupee extends losses, trades around 71 per dollar - Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ కరెన్సీ రూపాయి మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. అమెరికా చైనా మధ్య వాణిజ్య వివాద భయాలు, రిజర్వ్‌ బ్యాంక్‌ యథాతథ పాలసీ నేపథ్యంలో మరోసారి నీరసించింది.   బుధవారం3 పైసల స్వల్ప లాభంతో 70.46 వద్ద ముగిసిన  రుపీ గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఢమాల్‌ అంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 38 పైసలు(0.55 శాతం) క్షీణించి 70.84 వద్ద ప్రారంభమైంది అనంతరం మరింత  నష్టపోయింది. ఏకంగా  59పైసలు క్షీణించి 71.05 స్థాయికి పతనమైంది.  

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మళ్లీ పుంజుకోవడం, దేశీ స్టాక్స్‌లో ఇటీవల తిరిగి విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు చేపడుతున్న నేపథ్యంలో రూపాయి బలహీనపడుతున్నట్లు , నిపుణులు  ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు.  అయితే నేడు రిజర్వ్‌ బ్యాంక్‌ ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది.  తద్వారా రూ. 10,000 కోట్లను వ్యవస్థలోకి విడుదల చేయనుంది. దీంతో మిడ్‌సెషన్‌ నుంచీ రూపాయి కొంతమేర బలపడే అవకాశం ఉందని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top