
సాక్షి, న్యూఢిల్లీ: చైనా సంస్థ వన్ప్లస్ వన్ ప్లస టీవీలతో పాటు మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 26 న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వన్ప్లస్ 7 టీ పేరుతో ప్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేసింది. మే 2019 లో విడుదలై బహుళ ప్రజాదరణ పొందిన వన్ప్లస్ 7కు సక్సెస్సర్గా దీన్ని తీసుకొచ్చింది. రెండు స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 128 జీటీ స్టోరేజ్ ధర రూ. 37,999, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999 గా ఉంచింది. ఇవి సెప్టెంబరు 28నుంచి కొనుగోలుకు లభ్యం.
వన్ప్లస్ 7టీ ఫీచర్లు
6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ ప్లే
స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్
1080X2340పిక్సెల్స్ రిజల్యూషన
8జీబీ ర్యామ్ 48
48+16+12ట్రిపుల్ రియర్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3800 ఎంఏహెచ్ బ్యాటరీ
Introducing the OnePlus 7T pic.twitter.com/9posGe1E0n
— OnePlus India (@OnePlus_IN) September 26, 2019