జాగ్వార్‌  ఎక్స్‌జేలో స్పెషల్‌ ఎడిషన్‌ 

Jaguar Land Rover launches special XJ50 in India, priced at Rs 1.11 cr - Sakshi

ధర రూ.1.11 కోట్లు ∙గరిష్ట వేగం గంటకు 250 కిమీ.

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) జాగ్వార్‌ ఎక్స్‌జే మోడల్‌లో స్పెషల్‌ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. జాగ్వార్‌ ఎక్స్‌జే మోడల్‌ మార్కెట్లోకి వచ్చి 50 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్పెషల్‌  ఎడిషన్, జాగ్వార్‌ ఎక్స్‌జే50ను అందిస్తున్నట్లు జేఎల్‌ఆర్‌ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్‌ సూరి తెలిపారు.

ఈ కారు ధర రూ.1.11 కోట్లని పేర్కొన్నారు. 3 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌తో తయారైన  ఈ కారు కోసమే ప్రత్యేకంగా 19– అంగుళాల అలాయ్‌ వీల్స్‌ను రూపొందించామని చెప్పారాయన. వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోవటానికి 6.2 సెకన్లు చాలని... ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. అని పేర్కొన్నారు. ఈ కారులో ఎయిట్‌– స్పీడ్‌ జెడ్‌ఎఫ్‌ ఆటోమేటిక్‌ గేర్‌ బాక్స్, తదితర ప్రత్యేకతలున్నాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top