
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)ల నిర్వహణలో క్రియాశీల పాత్ర పోషించినందుకుగాను పవర్ గ్రిడ్ ఎస్ఆర్టీఎస్–1 బంగారు పతకాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ నరసింహన్ ఈ అవార్డు ప్రదానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్లను నిర్వహించి 56,000 మంది గ్రామీణ ప్రాంతాల వారికి పవర్గ్రిడ్ విశేష సేవలందించింది. ఇందుకు రూ.1.15 కోట్లు వ్యయమయ్యింది. ఒక తెలంగాణలో 12 ప్రాంతాలలో 36,468 గ్రామాలలో క్యాంప్లను నిర్వహించగా.. ఇందుకు రూ.59.08 లక్షలను వెచ్చించింది.