క్రిసిల్‌ లాభం రూ.77 కోట్లు | Crisil Q2 net profit rises 15% to Rs 77 cr | Sakshi
Sakshi News home page

క్రిసిల్‌ లాభం రూ.77 కోట్లు

Jul 18 2018 12:47 AM | Updated on Jul 18 2018 12:47 AM

Crisil Q2 net profit rises 15% to Rs 77 cr - Sakshi

ముంబై: ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.77 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం (రూ. 67 కోట్లు)తో పోల్చితే 15 శాతం వృద్ధి సాధించామని క్రిసిల్‌ తెలిపింది.

ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.436 కోట్లకు, ఇతర ఆదాయం దాదాపు రెట్టింపై రూ.17 కోట్లకు పెరిగాయని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ అషు సుయాశ్‌ చెప్పారు. ఒక్కో షేర్‌కు రూ.6 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. దేశీయ కంపెనీల బాండ్ల జారీ బాగా తగ్గినప్పటికీ తమ కీలక వ్యాపారం రేటింగ్స్‌ విభాగం మంచి వృద్ధినే సాధించిందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement