'మోదీజీ.. కిడ్నీ బాధితులను ఆదుకోండి' | ysrcp mp yv subbareddy met pm narendra modi | Sakshi
Sakshi News home page

'మోదీజీ.. కిడ్నీ బాధితులను ఆదుకోండి'

Mar 21 2017 3:47 PM | Updated on Aug 15 2018 2:32 PM

కిడ్నీ బాధితులను ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.

న్యూఢిల్లీ: కిడ్నీ బాధితులను ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. మంగళవారం ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన కిడ్నీ బాధితుల సమస్యలు, రామయపట్నంలోని పోర్టు నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు.

ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ మొదటి విడతలో ప్రకాశం జిల్లాను చేర్చి గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందించాలని ఈ సందర్భంగా కోరారు. అన్ని అనుకూలతలు ఉన్న రామయపట్నంలో పోర్టును ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement