అమరజీవికి విజయమ్మ, జగన్ నివాళులు | YS Vijayamma, YS Jaganmohan Reddy tribute to Potti Sriramulu | Sakshi
Sakshi News home page

అమరజీవికి విజయమ్మ, జగన్ నివాళులు

Dec 17 2013 2:24 AM | Updated on Apr 4 2018 9:25 PM

అమరజీవికి విజయమ్మ, జగన్ నివాళులు - Sakshi

అమరజీవికి విజయమ్మ, జగన్ నివాళులు

తెలుగువారందరికీ ఒకే రాష్ట్రం కావాలని ఆత్మార్పణం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తమ క్యాంపు కార్యాలయంలో నివాళులర్పించారు.

తెలుగువారందరికీ ఒకే రాష్ట్రం కావాలని ఆత్మార్పణం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తమ క్యాంపు కార్యాలయంలో నివాళులర్పించారు. అమరజీవి చిత్రపటానికి వినమ్రంగా పూలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటిం చారు. పార్టీ ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, గొల్ల బాబూరావు, టి.బాలరాజు, ధర్మాన కృష్ణదాస్, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, చెన్నకేశవరెడ్డి, బి.గురునాథరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపె విశ్వరూప్, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు సి.నారాయణరెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు, జూపూడి ప్రభాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ , పేర్ని వెంకట్రామయ్య, జోగి రమేష్, మద్దాలి రాజేష్‌కుమార్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, ఎంవీ మైసూరారెడ్డి, చిత్తూరు జిల్లా నేత పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమరజీవి ఆత్మబలిదానాన్ని స్మరించుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement