సువర్ణాక్షరాలతో లిఖించే అరుదైన రోజు: వైఎస్ జగన్ | YS Jagan Mohan Reddy hails Mars Orbiter Mission success | Sakshi
Sakshi News home page

సువర్ణాక్షరాలతో లిఖించే అరుదైన రోజు: వైఎస్ జగన్

Sep 24 2014 11:11 AM | Updated on Jul 25 2018 4:07 PM

సువర్ణాక్షరాలతో లిఖించే అరుదైన రోజు: వైఎస్ జగన్ - Sakshi

సువర్ణాక్షరాలతో లిఖించే అరుదైన రోజు: వైఎస్ జగన్

అంగారక కక్ష్యలోకి మార్స్ అర్బిటర్ మిషన్ విజయవంతంగా ప్రవేశించడం భారత అంతరిక్ష యుగంలో సువర్ణాక్షరాలతో లిఖించే అరుదైన రోజు

పులివెందుల: అంగారక కక్ష్యలోకి మార్స్ అర్బిటర్ మిషన్ విజయవంతంగా ప్రవేశించడం భారత అంతరిక్ష యుగంలో సువర్ణాక్షరాలతో లిఖించే అరుదైన రోజు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 
 
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో ఇదో మహాద్బుత చారిత్రక రోదసీ ఘట్టం అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మామ్ ప్రయోగం సక్సెస్ కావడంతో భారత శాస్త్రవేత్తల శక్తి ప్రపంచ దేశాలకు చాటి చెప్పినట్లయింది అని వైఎస్ జగన్ అన్నారు. 
 
అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగానే కాకుండా, తొలి ప్రయత్నంలోనే ఆ ఘనతను సాధించిన దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది,

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement