
సాక్షి, శ్రీకాకుళం : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న ప్రజాసంకల్పయాత్రకు మంగళవారం విరామం ఇచ్చారు. క్రైస్తవ సోదర, సోదరీమణులు క్రిస్మస్ను జరుపుకోవడానికి వెసులుబాటు కల్పించేందుకు పాదయాత్రకు విరామం ప్రకటించారు.
రేపు పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టి మండలం చాపర గ్రామం దగ్గర పాదయాత్ర శిబిరంలో వైఎస్ జగన్ ఉంటారని, మెళియపుట్టి నుంచి బుధవారం తిరిగి జననేత పాదయాత్రను ప్రారంభిస్తారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.