ఆర్‌.కృష్ణాపురం నుంచి ప్రజాసంకల్పయాత్ర

YS Jagan begins his 9th day of PrajaSankalpaYatra - Sakshi

సాక్షి, ఆళ్లగడ్డ : ప‍్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన తొమ్మిదోరోజు ప్రజాసంకల్పయాత్రను ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. బుధవారం ఉదయం ఆయన ఆర్‌.కృష్ణాపురంలో పాదయాత‍్రను మొదలుపెట్టారు. రాజన్న తనయుడు అడుగడుగునా జననీరాజనాలు అందుకుంటున్నారు. ప్రజాసంకల్పయాత్ర ఇవాళ... ఆర్‌.కృష్ణాపురం, పెద్దకోటకందుకూరు, పాలసాగరం మీదగా ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల జంక్షన్‌ వరకూ కొనసాగనుంది. అక్కడ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  రాత్రి 7.30 గంటలకు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌ బస చేస్తారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top