విశాఖ జిల్లా యలమంచిలి వద్ద ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది.
విశాఖ జిల్లా యలమంచిలి వద్ద ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. వారిలో తల్లి, ఒక కూతురు మరణించగా, మరో కూతురు తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఈ తల్లీ కూతుళ్లు ఎవరో, ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించారన్న విషయం ఇంకా తెలియరాలేదు. బహుశా కుటుంబలో కలతల వల్ల ఇలా చేసి ఉంటారని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.