ఎక్సైజ్ సుంకంపై పార్లమెంటులో ప్రశ్నిస్తాం: ఎంపీ మిథున్‌రెడ్డి | we raise question about excise duty in Parliament | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ సుంకంపై పార్లమెంటులో ప్రశ్నిస్తాం: ఎంపీ మిథున్‌రెడ్డి

Mar 13 2016 1:07 PM | Updated on May 25 2018 9:20 PM

బంగారంపై కేంద్రం ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ సుంకం విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు.

బంగారంపై కేంద్రం ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ సుంకం విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా సుదుంలో ఓ స్కూల్ వార్షికోత్సవానికి వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డిని బంగారు వర్తకులు కలసి ఎక్సైజ్ సుంకం ఎత్తివేసేలా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. అలాగే, చిత్తూరు న్యూట్రిన్ ఫ్యాక్టరీపై న్యాయం పోరాటం చేసి తొలగించబడిన కార్మికులకు న్యాయం చేస్తామన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement