సాక్షి,చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా ఏర్పడిన తాగునీటి ఎద్దడి కారణంగా ప్రభుత్వం 2,800 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. ఇందుకోసం నెలకు రూ.7కోట్లు ఖర్చు చేస్తోంది. జనవరి నుంచి ఇప్పటివరకూ తాగునీటి సరఫరాకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే.. జనవరిలో 1,317 గ్రామాలకు నీటి సరఫరా కోసం రూ 2,48,16,432 కోట్లు, ఫిబ్రవరిలో 1,697 గ్రామాలకు రూ.2,64,78 963 కోట్లు, మార్చిలో 2,096 గ్రామాలకు రూ 6,17,53,239 కోట్లు, ఏప్రిల్లో 2,560 గ్రామాలకు 6.52 కోట్లు, మే నెలలో 2610 గ్రామాల పరిధిలో 6.57 కోట్లు ఖర్చు చేయగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో 2800 గ్రామాలకు నీటిని సరఫరా చేసి, నెలకు రూ.7కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన రోజురోజుకు జిల్లాలో నీటి సమస్య పెరుగుతూనే ఉంది.
మొక్కుబడిగా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం
ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా ప్రజలందరికీ రూ.2కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తానని చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిం చి ఏడాదిన్నర ముగుస్తోంది. కాని జిల్లాలో తంబళ్లపల్లె, మదనపల్లె లాం టి ఫ్లోరైడ్ ప్రాంతాలతో సహా ఈ పథకం ద్వారా ఏ ఒక్కరికీ తాగునీరు అందడం లేదు. కేవలం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో మొక్కుబడిగా ఈ పథకాన్ని ప్రారంభించి చేతులు దులుపుకున్నారు. ఈ పథకానికి ఒక్కపైసా నిధులు కూడా వెచ్చించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. దాతలు ముందుకొస్తే తప్ప ఈ పథకాన్ని కొనసాగించలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
దాతలు నామమాత్రంగా కూడా ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా కేవలం 38 చోట్ల మాత్రమే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందులో కుప్పంలో 18 ప్లాంట్లు, చిత్తూరులో 3, శ్రీకాళహస్తిలో 4, నగరిలో 2, పలమనేరు, పుంగనూరు, సత్యవేడు, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అవి కూడా పూర్తిస్థాయిలో నడిచే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందకపోవడంతో కలుషితమైన నీటిని తాగి వేలాది మంది ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.
బాబు రాకతో కండలేరు ప్రాజెక్టుకు గ్రహణం
జిల్లావాసుల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.4300 కోట్లతో కండలేరు తాగునీటి పథకానికి రూపకల్పన చేశారు. జిల్లాలోని తిరుపతి, తిరుమల, చిత్తూరు, మదనపల్లి, పీలేరు, పలమనేరు, తది తర ప్రాంతాల్లోని 45 మండలాల పరి దిలోని 8,468 గ్రామాలకు తాగునీరు అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. ఈ పథకం వల్ల వేలాది గ్రామాలకు తాగునీరు అందించే అవకాశమున్నా పథకాన్ని పూర్తి చేస్తే పేరు కిరణ్కుమార్రెడ్డికి వస్తుందన్న అక్కసుతో చంద్రబాబు ఈ పథకాన్ని పక్కన బెట్టారు.
నీటి సరఫరాలో అక్రమాలు
నీటి సరఫరా పేరుతో టీడీపీ నేతలు పె ద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిసింది. పేరుకు వేలాది ట్యాంకర్లు చూపిస్తున్నా ఇవన్నీ తప్పుడు లెక్కలేనన్న ఆరోపణలున్నాయి. కాకి లెక్కలు చూపించి పెద్ద ఎత్తున నిధులు బొక్కుతున్నారు. నీళ్లు సరఫరా చేయకుండానే టీడీపీ నేతలు నిధులు బొక్కుతున్నారన్న ఆరోపణలున్నాయి.
నీటి కష్టాలు
Published Fri, Sep 4 2015 4:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement