నేటి నుంచి వన మహోత్సవాలు | Vana Mahotsav stats from saturday | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వన మహోత్సవాలు

Aug 31 2019 4:20 AM | Updated on Aug 31 2019 8:08 AM

Vana Mahotsav stats from saturday - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి నెల రోజులపాటు వన మహోత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం ఉదయం మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను కూడా ప్రారంభిస్తారు. తర్వాత అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు మంత్రులు పాల్గొంటారు. వన మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళిక రూపొందించినట్టు ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ దళాల అధిపతి మహమ్మద్‌ ఇలాయాస్‌ రిజ్వీ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement