యువకుడిపై దాడి: 2.50 లక్షలతో పరారీ | unknown person attacked youngster looted rs two lakhs | Sakshi
Sakshi News home page

యువకుడిపై దాడి: 2.50 లక్షలతో పరారీ

Apr 3 2015 11:31 PM | Updated on Sep 2 2017 11:48 PM

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగింది.

సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగింది. దుండగులు ఓ యువకుడిని కొట్టి అతని నుంచి రూ.2.50 లక్షలు ఎత్తుకుపోయారు.

 

సూళ్లూరుపేటకు చెందిన సిద్దిఖి అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై పట్టణం వైపు వస్తుండగా దారి కాచిన దుండగులు అటకాయించారు. ప్రతిఘటించిన సిద్దిఖిని విచక్షణారహితంగా కొట్టి, అతని వద్ద ఉన్న రూ.2.50 లక్షల నగదును లాక్కుని పరారయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement