ద్విచక్రవాహనాలు ఢీ - ఒకరు మృతి | Two-wheelers collided - one killed | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనాలు ఢీ - ఒకరు మృతి

Dec 31 2015 10:33 AM | Updated on Aug 30 2018 3:56 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా కలికిరి మండల కేంద్రానికి చెందిన మూలింటి వెంకటరమణారెడ్డి(45) గురువారం ఉదయం కురబలకోట మండలం అంగళ్లు గ్రామానికి స్కూటర్‌పై వెళ్తున్నాడు. మదనపల్లె సమీపంలో ఆయనను ఎదురుగా వేగంగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ఘటనలో వెంకటరమణారెడ్డి అక్కడికక్కడే చనిపోగా మరో వాహనంపైని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని తిరుపతి రుయాకు తరలించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement