రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి | two died in prakasam district road accidents | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి

Feb 16 2016 8:22 AM | Updated on Aug 30 2018 3:58 PM

ప్రకాశం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు.

బేస్తవారిపేట: ప్రకాశం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. రాచర్ల మండలం చెర్లోపల్లి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని శీలం రామకృష్ణారెడ్డి(30)అనే వ్యక్తి మృతిచెందాడు. బైక్‌పై గిద్దలూరు మండలం వేములపాడు నుంచి మోక్షగుండం వెళ్తుండగా ఎద్దులబండిని వెనక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో రామక్రిష్ణారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మరో ఘటనలో బేస్తవారిపేట మండలం కలగాట్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ప్రమాదవశాత్తూ జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ నుంచి కిందపడి ఓ వ్యక్తి మరణించాడు. మృతుడు వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం అన్నవరం గ్రామానికి చెందిన ఆరెళ్ల నారాయణ(50)గా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement