చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరు మృతి | Two killed in road accident in prakasam district | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరు మృతి

Feb 25 2016 7:59 AM | Updated on Aug 30 2018 3:58 PM

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉల్లగల్లు వద్ద గురువారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.

ఒంగోలు : ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం రెడ్డినగర్ వద్ద గురువారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను ఒంగోలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో చిన్నారి బాబు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులు దీక్షత (2) , కృష్ణారెడ్డి (46) గా గుర్తించారు. విజయవాడ నుంచి ప్రకాశం జిల్లా హనుమంతులపాలెం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement