సికిందరాబాద్లోని రాష్ట్రపతి నిల యంలో బసచేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని గురువా రం టీఆర్ఎస్ నేతల బృందం కలుసుకోనుంది.
సాక్షి, హైదరాబాద్: సికిందరాబాద్లోని రాష్ట్రపతి నిల యంలో బసచేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని గురువా రం టీఆర్ఎస్ నేతల బృందం కలుసుకోనుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు రాష్ట్రపతిని కలుసుకుంటారు. రాష్ట్ర విభజన బిల్లు ముసాయిదాకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యంతరాలను వారు రాష్ట్రపతి దృష్టికి తీసుకురానున్నారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చకు అదనపు గడువు ఇవ్వవద్దంటూ టీఆర్ఎస్ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతిని కలుసుకునేందుకు తెలంగాణ జేఏసీ కూడా అప్పాయింట్మెంట్ కోరినా, అందుకు అనుమతి రాలేదని సమాచారం.