ఆళ్లగడ్డలో నేడు అంత్యక్రియలు
ఆళ్లగడ్డ, న్యూస్లైన్: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పార్థివదేహానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ఇంటి వద్దే ఉంచనున్నారు. ఆ తర్వాత భూమా నివాసం నుంచి పాతబస్టాండ్, ఇండోర్స్టేడియం, జాతీయరహదారి, చిన్నకందుకూరు రస్తా మీదుగా అంతిమయాత్ర కొనసాగుతుంది.
మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జాతీయ రహదారి సమీపంలోని సుద్దపల్లి క్రాస్ రోడ్డు వద్ద సొంత స్థలం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
సాక్షి ప్రతినిధి/సాక్షి, కర్నూలు : ఏమ్మా బాగున్నావా.. అన్నా అంతా కుశలమేనా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ కలివిడిగా మెలిగిన శోభా నాగిరెడ్డి ఇక లేరనే చేదు నిజాన్ని ఆళ్లగడ్డ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నంద్యాల పట్టణంలో బుధవారం రాత్రి నిర్వహించిన జనభేరి సభలో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె.. తెల్లారేసరికి అనంతలోకాలకు వెళ్లిపోయారంటే ఏ ఒక్క మనసు అంగీకరించడం లేదు. బుధవారం రాత్రి నంద్యాల నుండి ఆళ్లగడ్డకు తిరుగుప్రయాణమైన ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు.
విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆమె క్షేమంగా బయటపడాలని.. ఎన్నికల్లో విజయం సాధించి తమను అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రార్థించారు. కులమతాలకు అతీతంగా తిండీతిప్పలు మానుకొని ఆమె క్షేమ సమాచారం కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. ఏదైతే వినకూడదనుకున్నారో.. ఆ విషాద వార్తే వారి చెవినపడింది. కష్టసుఖాలను ఇంట్లో మనిషిగా పంచుకున్న
ఆడపడుచు హఠాన్మరణం జిల్లా ప్రజలను దుఃఖసాగరంలో ముంచింది. గురువారం ఉదయం హైదరాబాద్ నుండి శోభమ్మ మృతదేహం నంద్యాల మీదుగా ఆళ్లగడ్డకు తరలించగా.. రోడ్ల వెంట అభిమానులు బారులు తీరారు. ఆత్మీయ నేత కడసారి చూపునకు పరితపించారు.
కన్నీరుపెట్టిన నంద్యాల
ఆత్మీయ నేత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసి నంద్యాల పట్టణం కన్నీటిసంద్రమైంది. శోభా నాగిరెడ్డి పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి నేరుగా నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు.
సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు అభిమానులు, ఆత్మీయుల సందర్శనార్థం అక్కడే ఉంచారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచీ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి కూడా జనం పోటెత్తారు. రాత్రి 9.30 గంటలకు భౌతికకాయాన్ని ఆళ్లగడ్డకు తరలించారు.
మూగబోయిన ఆళ్లగడ్డ
శోభా నాగిరెడ్డి పార్థివదేహం ఆళ్లగడ్డకు చేరుకోగానే ప్రజలు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. మధ్యాహ్నం నుండే దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. భూమా నివాసం అభిమానులతో పోటెత్తింది. మిత్రులు, కుటుంబ సభ్యులు ఆప్తులు, సన్నిహితులు.. పార్టీ శ్రేణులతో కిక్కిరిసింది.
ముఖ్యంగా మహిళలు ఈ విషాద ఘటనతో కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘ఎమ్మెల్యేగా తప్పక గెలుస్తుంది. మంత్రి అవుతారని ఆశించాము. ఇలా జరిగిందేంటి తల్లీ’’ అంటూ అభిమానులు బోరున విలపించిన దృశ్యాలు అందరినీ కలచివేశాయి.
అంబులెన్స్ నుంచి శవపేటికపైకి ఆమె పార్థివదేహాన్ని చేర్చగానే చిన్నకుమార్తె బొట్టు పెట్టి దీపం వెలిగించి బోరున విలపించడంతో అందరి హృదయాలు ద్రవించుకుపోయాయి. ‘‘అమ్మా.. లేమ్మా అంటూ’’ విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. శవపేటికపై తలపెట్టి రోదిస్తున్న కుమారుడిని చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు.
ఆ ముగ్గురి ఆవేదన వర్ణనాతీతం
ఎప్పుడూ చిరునవ్వు.. హుందాతనంతో అందరికీ ధైర్యం చెప్పే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి భూమా నాగిరెడ్డిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, స్థానికులకు ధైర్యం చెబుతూ వచ్చిన ఆయన.. శోభ మరణవార్త తెలియగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని పట్టుకొని రోదించడం అందరినీ కలచివేసింది.
ఆళ్లగడ్డలో నేడు అంత్యక్రియలు
Published Fri, Apr 25 2014 2:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement