డబ్బుల కోసం ఓ వ్యక్తి నాలుక కోసిన ఘనట తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోట లో శనివారం ఉదయం జరిగింది.
డబ్బుల కోసం ఓ వ్యక్తి నాలుక కోసిన ఘనట తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోట లో శనివారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే.. స్థానిక బ్రౌన్ కాలనికి చెందిన నాగసాయి(42) వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ఏటీఎం లో నుంచి డబ్బులు తీసుకుంటూ వెళ్తుండగా.. కొందరు దుండగులు అతన్ని బెదిరించి అతని వద్ద ఉన్న డబ్బులాక్కున్నారు. ఈ క్రమంలో తమ వివరాలు అతను ఎవరికి తెలియ జేయకూడదనుకొని అతిని నాలుక కోశారు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని కాకినాడ ఆప్పత్రికి తరలించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందులూ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.