తపాలా ఉద్యోగుల సమ్మెబాట | strick by post office employee | Sakshi
Sakshi News home page

తపాలా ఉద్యోగుల సమ్మెబాట

Feb 13 2014 2:33 AM | Updated on Sep 2 2017 3:38 AM

తపాలా ఉద్యోగుల సమ్మెబాట

తపాలా ఉద్యోగుల సమ్మెబాట

సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం స్థానిక తపాలా కార్యాలయ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు.

తపాలా ఉద్యోగులు
 నరసరావుపేటటౌన్,
 సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం స్థానిక తపాలా కార్యాలయ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పట్టణ అధ్యక్షుడు ఎ.వీరాంజనేయులు మాట్లాడుతూ దేశవ్యాప్త పిలుపు మేరకు బుధ, గురువారాల్లో సమ్మె నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏడో వేతన సవరణను ఈ ఏడాది జనవరి నుంచి అమలు పరచాలని, ఐదు సంవత్సరాలకొకసారి వేతన సవరణ జరపాలన్నారు. 50 శాతం కరువు భత్యాన్ని మూలవేతనంలో విలీనం చేయాలని, మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు.
 జి.డి.ఎస్‌లను కూడా ఏడో వేతన సంఘం పరిధిలోకి తేవాలన్నారు. ప్రతి ఉద్యోగికి ఐదు ప్రమోషన్లు ఇవ్వాలని, కారుణ్య నియామకాల్లోని పరిమితులు, ప్రతిబంధకాలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో శాశ్వత ఉద్యోగులను నియమించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement