శ్రీవారి సేవలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని గురువారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్ దర్శించుకున్నారు. న్యాయమూర్తికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అధికారులు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటంతో సత్కరించారు.