తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి | Samaikya activists attacks on telangana activists | Sakshi
Sakshi News home page

తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి

Jan 4 2014 3:24 PM | Updated on Sep 2 2017 2:17 AM

తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి

తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి

తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి, గందరగోళం మధ్య సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీల సంకల్పదీక్ష ముగిసింది.

హైదరాబాద్: తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి, గందరగోళం మధ్య సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీల సంకల్పదీక్ష ముగిసింది. శుక్రవారం ప్రారంభించిన దీక్షను ఈ రోజు మంత్రి  శైలజానాథ్‌ విరమింపజేశారు. ఆ సమయంలో  కొందరు తెలంగాణవాదులు వచ్చి తెలంగాణ నినాదాలు చేశారు. దాంతో తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి చేశారు.

ఎంపిలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, జి.వి.హర్ష కుమార్లు నిన్న ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సంకల్ప దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్‌లు గైర్హాజరు కాగా, రాయపాటి సాంబశివరావు మాత్రం నిన్న సాయంత్రం నాలుగు గంటలకు దీక్షకు హాజరయ్యారు.  సంకల్ప దీక్షకు పలువురు  రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సమైక్యవాదులు మద్దతు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement