ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారి బలవన్మరణం | rws officer suicide in anantapur | Sakshi
Sakshi News home page

ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారి బలవన్మరణం

May 2 2017 6:42 PM | Updated on Jun 1 2018 8:36 PM

అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ విభాగం ఈఈ ఆత్మహత్య చేసుకున్నారు.

అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ విభాగం ఈఈ ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కనక సింహన్‌(55) ఎనిమిది నెలలుగా అనారోగ్య కారణంగా సెలవులో ఉన్నారు.  అనంతపురం నాయక్‌నగర్లోని ఓ అపార్టుమెంట్‌లో కుటుంబంతో ఉంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు యత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.

మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకున్నారు. మధ్యాహ్నం సమయంలో పొరుగింటి వారు చూడటంతో ఆయన ఆత్మహత్య విషయం బయటకు తెలిసింది. అయితే, కుటుంబ కలహాలు కూడా ఆయనను బలవన్మరణానికి పురిగొల్పి ఉంటాయని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement