
అన్నదాత సంక్షేమమే లక్ష్యం: ప్రత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16ను శాసనసభలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16ను శాసనసభలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాటాడుతూ.. లోకానికి వెలుగు నిచ్చేది సూర్యుడయితే.. ప్రజలకు తిండిపెట్టేది పచ్చసూర్యుడు అని వ్యాఖ్యానించారు. అన్నదాత సంక్షేమానాకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతికూల వాతావణం వ్యవసాయం రంగానికి పెద్ద సమస్యగా మారిందన్నారు.
తగినంత మౌలికసదుపాయాలు లేనికారణంగా రైతులు తమ ఉత్పత్తులను తక్కువగా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. అవరోధాలను అన్నింటినీ తొలగించి అన్నదాతలకు అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్నదాతల ముఖాల్లో వెలుగు చూసేందుకు తమ సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు.