గుంటూరు జిల్లాలో పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
గుంటూరు జిల్లాలో పోలీసు ఆంక్షలు
Jul 25 2017 12:29 PM | Updated on Aug 24 2018 2:36 PM
గుంటూరు : గుంటూరు జిల్లాలో పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్తో పాటు యాక్టు 30 అమలులో ఉంది. రేపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రకు కాపులు వెళ్లకుండా పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. కాపు నాయకుల ముందస్తు అరెస్టులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే జిల్లాలో వందలాదిమంది కాపులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.రెండు వేలమందితో వాహన తనిఖీలు చేస్తున్నారు. అమరావతి చుట్టుపక్కల 25 చెక్పోస్టులతో పహారా ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement