జగన్‌తోనే పేదలకు న్యాయం | People Sharing Their Problems in Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

మందులకు డబ్బులు సరిపోవడం లేదు

Nov 27 2018 7:09 AM | Updated on Nov 27 2018 7:09 AM

People Sharing Their Problems in Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం :‘నాయనా.. నాకు వస్తున్న పింఛన్‌ నా మందులకే సరిపోవడం లేదు. పింఛన్‌ డబ్బు పెంచితే మా బతుకు మెరుగుపడుతుంది. మాలాంటి వృద్ధులను ఆదుకోవాలి నాయనా..’ అని వీరఘట్టం మండలం విక్రంపురం గ్రామానికి చెంది న పిన్నింటి నారాయణమ్మ అనే వృద్ధురాలు కోరారు. దీనికి స్పందించిన జగన్‌ మన ప్రభుత్వం రాగానే పింఛన్‌ డబ్బును రూ.2వేలు చేస్తామవ్వా అని సమాధానమిచ్చారు.

రేషన్‌ కార్డు లేదన్నా..
నా భర్త తాలాబత్తుల గణేష్‌ మూడేళ్ల కిందట నాటుబండి కింద పడి చనిపోయారు. కనీసం బీమా కూడా రాలేదు. ఇంతవరకు ప్రభుత్వం వితంతు పింఛన్‌ మంజూరు చేయలేదు. కొత్త రేషన్‌ కార్డు కూడా రాలేదు. కూలి చేసుకుంటూ పిల్ల ల్ని చదివించడం కష్టంగా ఉంది. నా లాంటి వాళ్లను ఆదుకోవాలి.– తాలబత్తుల రాజేశ్వరి, కొత్తపల్లి గ్రామం,గరుగుబిల్లి మండలం, విజయనగరం జిల్లా.

రూ.1500 రావడం లేదన్నా..
‘అన్నా.. నేను దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాను. మా అమ్మ, నాన్న సాదు గోవింద, కృష్ణవేణిలు చెన్నై పట్టణానికి వలస వెళ్లి కూలిపనులు చేసుకుంటున్నా రు. నాకు రూ.వెయ్యి మాత్రమే పింఛన్‌ వస్తోందన్నా.. రూ.1500 వస్తే గానీ నా మందులకు సరిపోదు’ అని వీరఘట్టం మండలం నడుకూరు గ్రామానికి చెం దిన సాదు భారతి విన్నవించగా.. కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని జగన్‌ భరోసా ఇచ్చారు.

తోటపల్లి నీరు రావడం లేదు..
తోటపల్లి ఎడమ కాలువ ఒకటో బ్రాంచి చానల్‌ పిల్ల కాలువ ద్వారా గడిచిన పదేళ్లుగా మా పంటపొలాలకు సాగునీరు అందడం లేదు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో ఏటా 300 ఎకరాల్లో పంట కు నష్టం కలుగుతుంది. మా సమస్య పరిష్కరించాలన్నా.– కురిటి సిద్ధార్థ, రైతు, నడుకూరు గ్రామం, వీరఘట్టం

కారుణ్య నియామకం చేపట్టాలి
కారుణ్య నియామకం చేపట్టి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. మా నాన్న అన్ను సత్యం వీఆర్‌ఏగా పనిచేసి 2013 లో మరణించారు. ఇంతవరకు కారుణ్య నియామకాల్లో భాగంగా మా కుటుం బంలో ఎవరికీ ఉద్యోగం ఇవ్వలేదన్నా. మా అమ్మ తవిటమ్మ, లేకపోతే ఉన్నత చదువులు చదువుకున్న మా అన్నదమ్ములు అన్ను మహేశ్వరరావు, అన్ను ప్రసాద్, అన్ను నారాయణల్లో ఎవరికైనా ఉద్యోగం ఇప్పించండన్నా.– అన్ను గోవిందమ్మ, వీరఘట్టం

జగన్‌తోనే పేదలకు న్యాయం
జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు జన్మభూమి కమిటీల పేరుతో పేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా అన్యాయం చేస్తున్నారు. అందుకే జగన్‌ పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు. ఆయనను చూడడానికే వచ్చాం. ఆయన అధికారంలోకి వస్తే మా బతుకులు బాగు పడతాయన్న ఆశ ఉంది.                                          – పైల లక్ష్మి, విక్రంపురం,వీరఘట్టం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement