ఇసుక కొరత లేకుండా చూస్తాం : పెద్దిరెడ్డి

Peddireddy Ramachandra Reddy Comments On Sand Shortage - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఒకవైపు వరదలు కొనసాగుతున్నప్పటికీ 65 రీచ్ ల ద్వారా ఇసుకను వినియోగదారులకు అందజేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు 1.70 లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేయడం జరిగిందని వెల్లడించారు. ఇసుక కావలసినవారు sand.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top