జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులను అధికార యంత్రాంగం వేయి కళ్లతో పరిశీలిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే వివిధ రకాల ఖర్చులకు జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం రేట్లను కూడా నిర్ణయించింది. ఈ రేట్ల ప్రకారం అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెట్టే భోజనాలు, కాఫీ, టీ తదితర వాటికి లెక్క కట్టి ఖర్చును అభ్యర్థుల ఖాతాలో రాస్తారు. ఇలా జెండాలు, పోస్టర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, జీపులు, ఇతర వాహనాలకు కూడా రేట్లను నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గానికి 7 రకాల టీమ్లు ఉన్నాయి.
వీటి లక్ష్యం ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయడం, అభ్యర్థులు చేసే ఖర్చును నిశితంగా గమనించడం, ఆధారాలు సేకరించి అభ్యర్థి వారీగా రికార్డులలో ఖర్చుల వివరాలను నమోదు చేస్తారు. పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థులు రూ.78 లక్షలు, శాసనసభకు పోటీ చేసేవారు రూ.28 లక్షల వరకు వ్యయం చేయవచ్చు. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ఖర్చును మించి ఎక్కువ ఖర్చు చేస్తే అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది. నామినేషన్ల అనంతరం పోటీ చేసే అభ్యర్థులు ప్రచారంలో చేసే ఖర్చుల వివరాలను ప్రతి మూడు రోజులకోసారి రిటర్నింగ్ అధికారికి, వ్యయ పరిశీలకులకు సమర్పించాల్సి ఉంది.
అభ్యర్థులు సమర్పించిన ఖర్చుల వివరాలను తమ దగ్గర ఉన్న షాడో రిజిస్టర్లో నమోదు చేసిన వాటితో సరిచూస్తారు. ఆధారాలతో సహా సేకరించిన ఖర్చుల వివరాలు అభ్యర్థులు చూపిన ఖర్చుల్లో లేకపోతే వెంటనే నోటీసులు ఇస్తారు. వీటికి విధిగా జవాబు ఇవ్వాల్సి ఉంది. 2004, 2009 ఎన్నికలతో పోలిస్తే ఈసారి వ్యయంపై నిఘా పెరిగిందనేది సుస్పష్టం. అయితే అధికారులు లెక్కిస్తున్న ధరలు కాస్తా ఎక్కువగా నిర్ణయించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రేట్లపై రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
షాడో డేగ కన్ను
Published Tue, Apr 15 2014 2:16 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రాణదాత ఆ పోలీసు
నూకాంబిక హుండీ ఆదాయం రూ.66.69 లక్షలు
ఈ పాపం ఎవరిది?
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement