Sakshi News home page

'వందరోజుల పాలనలో ఒరిగిందేమీ లేదు'

Published Mon, Sep 15 2014 2:23 PM

'వందరోజుల పాలనలో ఒరిగిందేమీ లేదు' - Sakshi

అనంతపురం: సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అంటూ ధ్వజమెత్తారు. వ్యవసాయ రుణాల మాఫీ పేరుతో అధికారం చేపట్టి రైతుల్నే మోసం చేశారని విమర్శించారు.

బంగారం వేలం పాటలను అడ్డుకుంటామని అన్నారు. వందరోజుల చంద్రబాబు పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన రైతు రుణ మాఫీని అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement