ఇంటర్మీడియెట్ బోర్డు పాలకవర్గంలోనే కార్పొరేట్ కాలేజీల ప్రతినిధిని సభ్యునిగా రాష్ట్రప్రభుత్వం నియమించింది.
పాలకవర్గంలో సభ్యునిగా నారాయణ సంస్థల ప్రతినిధి నియామకం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డు పాలకవర్గంలోనే కార్పొరేట్ కాలేజీల ప్రతినిధిని సభ్యునిగా రాష్ట్రప్రభుత్వం నియమించింది. కార్పొరేట్ సంస్థ అయిన ‘నారాయణ’ విద్యాసంస్థల నుంచి ఒక ప్రతినిధిని ఇంటర్ బోర్డు పాలకవర్గంలో సభ్యునిగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ జీవో 107ను విడుదల చేశారు. దీనిపై వివిధ వర్గాలనుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.