పెద్దదోర్నాల : నల్లమల పరిరక్షణకు అటవీశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అటవీశాఖ ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నల్లమల పరిసరాల్లోని ఫారెస్టు చెక్పోస్టుల వద్ద అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి వాహనంపై డేగకన్ను వేసేలా చర్యలు చేపట్టింది. దీంతో కొంత కాలం నుంచి ప్రమాదాల సంఖ్యతో పాటు, నేరాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. చెక్పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన టోల్గేట్లలో నల్లమలలో ప్రయాణించే వాహనాల నుంచి పర్యావరణ రుసుం వసూలు చేస్తుండటంతో పాటు అటవీశాఖకు ఏటా రూ.18 లక్షలకుపైగా అదనపు ఆదాయం సమకూరుతోంది.
ఈ నిధులతో నల్లమలలో ప్రయాణికులు జారవిడిచే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ప్లాస్టిక్ ఫ్రీజోన్గా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రత్యేకంగా 32 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని ఏర్పాటు చేసి తద్వారా నల్లమల్లలో ప్రయాణించే వారు జారవిడిచే ప్టాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అటవీ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆధునిక టెక్నాలజీతో కూడిన వాకీటాకీలను ఉపయోగిస్తున్నారు.
నిఘా కెమెరాలు, టోల్ గేట్ల ఏర్పాటుతో ఉపయోగాలు ఎన్నో...
అటవీ సంపద అక్రమ తరలింపు అరికట్టేందుకు పెద్దదోర్నాల సమీపంలోని గణపతి చెక్పోస్టు వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. నల్లమలలో హాయిగా విహరించే జంతువులు రోడ్లపై తిరుగుతూ తరుచూ ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్న నేపథ్యంలో నల్లమల అటవీప్రాంతంలో ప్రయాణించే వాహనాల వేగనియంత్రణ, ఈ నిఘా వ్యవస్థ ఏర్పాటుతో మంచి ఫలితాలు వస్తున్నాయి.
నల్లమలలో ప్రయాణించే వాహనాలు ఏ సమయంలో చెక్పోస్టుల వద్దకు వచ్చాయి. ఎంత సమయం అటవీప్రాంతంలో ప్రయాణించి అవతలి చెక్పోస్టులను దాటాయి. ఇలా వివరాలన్నీ కంప్యూటర్లు, నిఘా కెమెరాలలో రికార్డు అవుతుండటంతో కేసులు చేధించటం సులభతరంగా మారింది. దీని వల్ల అటవీ ప్రాంతంలో సంచరించే వన్య ప్రాణులకు ప్రమాదం కలిగించే వాహనాలను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేయటం, నల్లమలలో జరిగే అక్రమ రవాణా, వన్యప్రాణుల ప్రాణాలను బలిగొనే వాహనాల గుర్తింపుతో పాటు, పోలీసు శాఖకు సంబంధించి ఎన్నో నేరాలు, నేరపూరిత వ్యక్తుల కదలికల గుర్తింపు, ప్రమాదాలకు కారణమైన వాహనాల గుర్తింపు సైతం సులభతరంగా మారింది,
చెక్ పోస్టుల వద్ద కంప్యూటర్ ఎన్క్లోజర్లతోపాటు టోల్గేట్, ఎలక్ట్రానిక్ గేటు ఏర్పాటు చేశారు. నల్లమలలోని ముఖ్య ప్రాంతాల్లో ట్రాప్డ్ కెమెరాలను ఏర్పాటు చేసి వన్యప్రాణుల కదలికలతో పాటు ఇతరుల సంచారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
నల్లమలలో నిఘా నేత్రాలు
Published Fri, Aug 21 2015 2:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హర్యానాలో బీజేపీ గట్టెక్కెనా?.. కాంగ్రెస్కు ఛాన్స్ ఎంత?
క్లుప్తంగా
జ్యోతిష్కుడు కిడ్నాప్
ఈవీఎంల భద్రతకు ముప్పులేదు
అమెరికా రాయబార కార్యాలయం ముట్టడికి యత్నం
నగల చోరీ కేసులో ఏడుగురి అరెస్టు
చైన్నె విమానాశ్రమంలో డీజీ యాత్ర సేవలు
భవానీ నదిలో మునిగి అన్నదమ్ముల మృతి
భార్య హత్యకేసులో భర్త అరెస్టు
కండలేరు జలాశయం పరిశీలన
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement