రాష్ట్ర అభివృద్ధికి ఆదేవుడి ఆశీస్సులు ఉండాలి: మంత్రి

Minister Vellampalli Srinivas Visits Tirumala Temple In Tirupati - Sakshi

సాక్షి, తిరుమల: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆ దేవుని కోరుకున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి అడ్డు పడుతున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార వికేంద్రీకరణ చేపట్టారని పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు.. ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top