హైకోర్టు డిజైన్లపై ప్రధాన న్యాయమూర్తికి ప్రజేంటేషన్ ఇస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
'హైకోర్టు డిజైన్లపై ప్రజంటేషన్ ఇస్తాం'
Jul 12 2017 4:37 PM | Updated on Sep 5 2017 3:52 PM
అమరావతి: హైకోర్టు డిజైన్లపై ప్రధాన న్యాయమూర్తికి గురువారం ప్రజేంటేషన్ ఇస్తామని ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం మరోసారి మాస్టర్ ప్లాన్ పై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సచివాలయం డిజైన్లపై గురువారం జీఏడీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
250 ఎకరాల పరిధిలో అసెంబ్లీ, సచివాలయం భవనాలు నిర్మాణం జరగనుందన్నారు. సెప్టెంబర్ 15 నాటికి అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఇంటీరియర్స్తో కలిపి తుది డిజైన్లను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు అందజేస్తారని ఆయన తెలిపారు.
Advertisement


