వివాహిత దారుణ హత్య | Sakshi
Sakshi News home page

వివాహిత దారుణ హత్య

Published Fri, Feb 10 2017 11:38 AM

married lady murdered in Anantapur district

గోరంట్ల: అనంతపురం జిల్లా గోరంట్లలో వివాహిత దారుణహత్యకు గురైంది. స్థానికంగా నివాసముంటున్న శంషాద్‌భానుపై గుర్తుతెలియని దుండగులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. దీంతో ఆమె తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలనాకి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతురాలి తల్లిదండ్రులు మాత్రం అత్తింటివారే తమ కూతురిని హత్యచేశారని ఆరోపిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement