విద్యుదాఘాతంతో యువకుడి మృతి | Man dies of electric shock in pinapaka | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Jan 1 2014 5:10 AM | Updated on Sep 5 2018 2:26 PM

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సీతంపేటలో మంగళవారం చోటు చేసుకుంది.

పినపాక, న్యూస్‌లైన్: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సీతంపేటలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సీతంపేటకు చెందిన సంతపురి సతీష్(27) మంగళవారం ఇంట్లో నీటి కోసం విద్యుత్ మోటార్ స్విచ్ వేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పైన ఉన్న వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలిచంగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. టాటా ఏస్ వాహనం నడిపి కుటుంబాన్ని పోషించుకుంటున్న సతీష్‌కు భార్య నళిని, కుమార్తె నందిని, కుమారుడు సాయిలు ఉన్నారు. సతీష్ మృతితో ఆ కుటుంబం వీధినపడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏడూళ్లబయ్యారం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.   
 
 కారేపల్లిలో మహిళ..
 కారేపల్లి : విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి కారేపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కారేపల్లి మంజులవాడకు చెందిన బాస శాంతమ్మ(60) స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఓ హోటల్‌లో పని చేస్తోంది. ఆమె మంగళవారం రాత్రి విద్యుత్ మోటార్ వేసేందుకు వెళ్లగా తీగెలు తగిలి విద్యుదాఘాతంతో స్పృహ కోల్పోయింది. హోటల్ నిర్వాహకులు, స్థానికులు ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు శాంతమ్మకు భర్త రాములు, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వీరందరికి వివాహాలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement