బైక్ పై వేగంగా వెళ్తుండగా అదుపు తప్పడంతో కిందపడి హైదరాబాద్ వాసి మృతి చెందాడు.
దుర్గి (గుంటూరు జిల్లా) : బైక్పై వేగంగా వెళ్తుండగా అదుపు తప్పడంతో కిందపడి హైదరాబాద్ వాసి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరు జిల్లా దుర్గి మండలం పొలెపల్లి అడ్డరోడ్డు వద్ద జరిగింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన విజయకృష్ణ రాజు(30) బైక్పై ఒంగోలులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్తున్నాడు.
కాగా మార్గ మధ్యంలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుంటూరు జిల్లా దుర్గి మండలం పొలెపల్లి అడ్డరోడ్డు వద్ద బైక్ అదుపుతప్పడంతో కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే 108లో గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో మృతి చెందాడు.