ప్రకాశం జిల్లాలో శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన గాయకుడు అందనప్ప మరణించారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన గాయకుడు అందనప్ప మరణించారు. డోర్నాల మండలం చింతల ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న కారు, బస్సు డీ కొన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అందనప్ప మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.