బాబు కోసం వచ్చి.. లిఫ్టులో ఇరుక్కున్నారు! | Sakshi
Sakshi News home page

బాబు కోసం వచ్చి.. లిఫ్టులో ఇరుక్కున్నారు!

Published Fri, Feb 13 2015 7:04 PM

బాబు కోసం వచ్చి.. లిఫ్టులో ఇరుక్కున్నారు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన కాపునాడు నాయకులు లిఫ్టులో ఇరుక్కుపోయారు. లేక్వ్యూ అతిథిగృహంలోని లిఫ్టులో కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మంగారావు సహా ఆరుగురు అతిథిగృహంలోని లిఫ్టులో ఇరుక్కున్నారు.

గంట సేపటి నుంచి వాళ్లు లిఫ్టులోనే ఉండిపోయారు. సాంకేతిక సమస్య కారణంగా లిఫ్టు ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియక వాళ్లు ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement