పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల నియామకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు అధికార పార్టీ నాయకులు అందుకు తగ్గ కసరస్తు ప్రారంభించారు.
- ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం
- నెలరోజుల్లో కొలిక్కి
నర్సీపట్నం టౌన్: పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల నియామకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు అధికార పార్టీ నాయకులు అందుకు తగ్గ కసరస్తు ప్రారంభించారు. ప్రస్తుత పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంతో ఆయా పదవులపై ఆశావహుల్లో ఆశలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కని నాయకులతోపాటు కష్టపడి పనిచేసిన ద్వితీయశ్రేణి నాయకులు ఎలాగైనా నామినేటెడ్ పదవులు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులకు తీవ్ర పోటీ
జిల్లాలో మార్కెట్యార్డు కమిటీ చైర్మన్ పదవుల కోసం అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 8 మార్కెట్ యార్డులకు పాలకవర్గాలున్నాయి. ఇవి రద్దు కావడంతో చైర్మన్ నుంచి డెరైక్టర ్ల పదవులకు వరకు నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ ఉంది. వ్యవసాయంతో అనుబంధం ఉన్న వారికే కమిటీ పదవి ఇస్తే రైతులకు మేలు జరుగుతుందన్న ఆలోచనలో పంచాయతీరాజ్శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ప్రముఖ దేవాలయాలకూ కొత్త కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో మంత్రి అయ్యన్న ఇటీవల నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులతో సమావేశమై.. ఎవరెవరికి ఏ పదవి ఇస్తే బాగుటుందనే దానిపై చర్చించడంతో ఆశలు రేకెత్తాయి. వారం రోజుల కిందట మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. ఆ పదవులను చాలా మంది ఆశించినా రాజకీయ సమీకరణాల దృష్ట్యా పాతసంతబయలకు చెందిన వ్యక్తికి ఇచ్చారు. దీంతో భంగపడ్డ ఆశావహులు కొందరు చైర్మన్, డెరైక్టర్లు, దేవాలయాల చైర్మన్ పదవులు వస్తాయనే ఆశతో ఉన్నారు. నెల రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.