అంబులెన్స్ ప్రమాదంలో నలుగురు మృతి | four killed in ambulance crash | Sakshi
Sakshi News home page

అంబులెన్స్ ప్రమాదంలో నలుగురు మృతి

Feb 14 2016 1:26 PM | Updated on Aug 30 2018 3:58 PM

అంబులెన్స్ ప్రమాదంలో నలుగురు మృతి - Sakshi

అంబులెన్స్ ప్రమాదంలో నలుగురు మృతి

యలమంచిలి సమీపంలో అంబులెన్స్ బోల్తాపడిన ఘటనలో చిన్నారి సహా.. ముగ్గురు మృతి చెందారు.

విశాఖ జిల్లా యలమంచిలి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగురికి చేరింది. ఆదివారం మధ్యాహ్నం ఓ అంబులెన్స్ అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోవడంతో 10 నెలల శిశువుతోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

 

ఓ మృతదేహాన్ని అంబులెన్స్‌లో హైదరాబాద్ నుంచి ఒడిశాలోని కటక్‌కు తీసుకెళుతున్నారు. యలమంచిలి సమీపంలోకి రాగానే అంబులెన్స్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి పడిపోయింది. క్షతగాత్రులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు సహా ఓ చిన్నారి మృతి చెందారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement