చంద్రబాబుతో భేటీకి రాజధాని ప్రాంత రైతుల నిరాకరణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీకి రాజధాని ప్రాంత రైతులు నిరాకరిస్తున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీకి రాజధాని ప్రాంత రైతులు నిరాకరిస్తున్నారు. శుక్రవారం చంద్రబాబు రైతులతో సమావేశం కావాల్సి ఉంది. అయితే రైతులు ఆ సమావేశాన్ని నిరాకరించారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే సమావేశమవుతామంటూ రైతులు పట్టుబట్టడంతో ఆ భేటీ వాయిదా పడింది.
ఇదిలా ఉండగా చంద్రబాబుతో భేటీ కావాల్సిందిగా రైతులను టీడీపీ ప్రజాప్రతినిధులు బతిమలాడుతున్నారు. కాగా, టీడీపీ నేతల మాత్రం చంద్రబాబు బిజీగా ఉండటం వల్లే రైతులను కలవలేదని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.


